Udayam Digital
Menu
హోమ్
మా గురించికాంటాక్ట్
Back to feed

"నాపై ఒక్క కేసూ రుజువు కాలేదు": లలిత్ మోదీ సంచలన వ్యాఖ్యలు

Sonia Singh Jun 04, 2026 9:49 AM అల్ ఇండియా 4 viewsabout 2 hours ago
"నాపై ఒక్క కేసూ రుజువు కాలేదు": లలిత్ మోదీ సంచలన వ్యాఖ్యలు - Udayam Digital
తాను భారత్‌కు తిరిగి రాబోవడం లేదని, అక్కడ తనను తాను నిరూపించుకోవాల్సిన అవసరం లేదని ఐపీఎల్ మాజీ ఛైర్మన్ లలిత్ మోదీ స్పష్టం చేశారు. 17 ఏళ్లుగా తనను కోర్టుకు తీసుకెళ్లలేదని, తనపై ఒక్క క్రిమినల్ కేసు కూడా రుజువు కాలేదని లండన్ పాడ్‌కాస్ట్‌లో పేర్కొన్నారు. తాను చట్టానికి భయపడి పారిపోలేదని, 'పరారీలో ఉన్న వ్యక్తి' అన్న ముద్రను ఖండిస్తున్నానని చెప్పారు. మీడియానే తన ప్రతిష్టను దెబ్బతీసిందన్నారు. 2010 నుంచి లండన్‌లో ఉంటున్న ఆయనపై మనీలాండరింగ్ ఆరోపణలు ఉన్న సంగతి తెలిసిందే.

Comments

G
Loading comments...