Back to feed
ఐరాస నివేదికపై భారత్ తీవ్ర ఆగ్రహం
Rohit Jun 16, 2026 6:55 AM అల్ ఇండియా 4 viewsabout 3 hours ago

ఐరాస భద్రతా మండలి సంస్కరణల నివేదిక పక్షపాతంగా ఉందని భారత్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. శాశ్వత సభ్యత్వాల పెంపుపై ప్రపంచవ్యాప్త మద్దతును ఈ ‘ఎలిమెంట్స్ పేపర్’లో విస్మరించారని అంబాసిడర్ హరీష్ పర్వతనేని మండిపడ్డారు.
కేవలం తాత్కాలిక సభ్య దేశాల సంఖ్యను పెంచాలనే నివేదికలోని ప్రతిపాదనను భారత్ వ్యతిరేకిస్తోంది. భద్రతా మండలిలో శాశ్వత సభ్యత్వం కోసం దశాబ్దాలుగా జరుగుతున్న డిమాండ్లను ఈ ముసాయిదా పట్టించుకోలేదని భారత్ స్పష్టం చేసింది.
Comments
Loading comments...



