వార్తలకు తిరిగి వెళ్లండి

బిహార్లోని ఐఐటీ పట్నాలో ఇంజినీరింగ్ ఫైనలియర్ చదువుతున్న హైదరాబాద్కు చెందిన హర్షిత్ రాజ్ ప్రమాదవశాత్తు మరణించారు. శనివారం ఉదయం క్యాంపస్లో క్రికెట్ ఆడుతుండగా, పొరపాటున విద్యుత్ స్తంభాన్ని తాకడంతో తీవ్ర విద్యుదాఘాతానికి గురయ్యారు. వెంటనే ఆసుపత్రికి తరలించినప్పటికీ ఫలితం లేకపోయింది.
చందానగర్కు చెందిన విద్యార్థి మృతితో కుటుంబంలో విషాదం నెలకొంది. ఈ ఘటనపై అధికారులు విచారణ జరుపుతున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని తరలించారు.
Comments
Loading comments...

