Back to feed
గంగూలీ పరువు నష్టం ఫిర్యాదు
SAi Jun 16, 2026 11:58 AM అల్ ఇండియా 6 viewsabout 3 hours ago

సోషల్ మీడియాలో తన ప్రతిష్ఠను దెబ్బతీసేలా తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్నారంటూ భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ సౌరభ్ గంగూలీ కోల్కతా పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఒక అనధికార ఫేస్బుక్ పేజీ, మీడియా సంస్థ లక్ష్యంగా ఆయన ఈ చర్య తీసుకున్నారు.
తనపై ఉద్దేశపూర్వకంగా తప్పుదోవ పట్టించే కంటెంట్ను షేర్ చేస్తున్న వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని గంగూలీ కోరారు. ఈ ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తును ప్రారంభించారు.
Comments
Loading comments...



