Back to feed
ఆంధ్రప్రదేశ్Breaking
తిరుమలలో భక్తుల రద్దీ: 10 గంటల నిరీక్షణ
Anil Jun 18, 2026 2:49 AM తిరుపతి 3 viewsabout 1 hour ago

తిరుమలలో శ్రీవారి భక్తుల రద్దీ కొనసాగుతోంది. ప్రస్తుతం 31 కంపార్టుమెంట్లలో భక్తులు దర్శనం కోసం వేచి ఉన్నారు. టోకెన్ లేని సర్వదర్శనం భక్తులకు సుమారు 10 గంటల సమయం పడుతోంది. నిన్న ఒక్కరోజే 82,438 మంది భక్తులు స్వామిని దర్శించుకోగా, 39,948 మంది తలనీలాలు సమర్పించారు.
భక్తుల రద్దీ దృష్ట్యా టీటీడీ తగిన ఏర్పాట్లు చేస్తోంది. నిన్నటి శ్రీవారి హుండీ ఆదాయం రూ.4.24 కోట్లుగా నమోదైంది.
Comments
Loading comments...



