Back to feed
విద్యార్థుల భద్రతపై సీపీ సజ్జనార్ సూచనలు
Ravi Jun 19, 2026 8:24 AM హైదరాబాద్ 1 viewsabout 4 hours ago

విద్యాసంస్థల్లో ర్యాంకుల కంటే సురక్షితమైన వాతావరణం ముఖ్యమని సీపీ సజ్జనార్ పేర్కొన్నారు. మైనర్ డ్రైవింగ్, నేరాల్లో విద్యార్థుల భాగస్వామ్యం ఆందోళనకరమని, దీనిపై తల్లిదండ్రులు, పాఠశాల యాజమాన్యాలు నిరంతరం పర్యవేక్షించాలని ఆయన సూచించారు.
స్కూల్ బస్సు డ్రైవర్లపై నిఘా పెట్టి, ట్రాఫిక్ నియమాలపై విద్యార్థులకు అవగాహన కల్పించాలని కోరారు. స్కూల్ పరిసరాల్లో సీసీటీవీలు ఏర్పాటు చేయాలని, పొగాకు ఉత్పత్తుల అమ్మకాలపై కఠినంగా వ్యవహరిస్తామని హెచ్చరించారు.
Comments
Loading comments...



