Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సీబీఎస్‌ఈ కీలక నిర్ణయం: సర్వర్ల పరిధిలోకి మార్కుల డేటా

Follow Udayam on Google
Ravi Shukla Jun 08, 2026 3:23 PM జాతీయంGeneral
సీబీఎస్‌ఈ కీలక నిర్ణయం: సర్వర్ల పరిధిలోకి మార్కుల డేటా - Udayam
పన్నెండో తరగతి బోర్డు పరీక్షల జవాబు పత్రాల రీ-ఎవాల్యుయేషన్ ప్రక్రియలో సీబీఎస్‌ఈ కీలక మార్పులు చేసింది. ఈ ఏడాది ఆన్-స్క్రీన్ మార్కింగ్ విధానంలో తలెత్తిన సాంకేతిక లోపాలు, వివాదాల నేపథ్యంలో భద్రతను మరింత కట్టుదిట్టం చేసింది. డేటా దుర్వినియోగం కాకుండా ఉండేందుకు, 'కోఎంప్ట్ ఎడ్యుటెక్' సంస్థ సర్వర్లలో ఉన్న విద్యార్థుల మార్కుల రికార్డులన్నింటినీ సీబీఎస్‌ఈ తన సొంత సర్వర్లలోకి మార్చింది. అయితే, జవాబు పత్రాల స్కానింగ్ బాధ్యతలను మాత్రం అదే సంస్థకు కొనసాగిస్తున్నట్లు ఐఐటీ నిపుణుల కమిటీ స్పష్టం చేసింది.

Comments

G
Loading comments...