వార్తలకు తిరిగి వెళ్లండి

అంతర్జాతీయంగా విమాన ఇంధన ధరలు పెరగడంతో ఎయిరిండియా కీలక నిర్ణయం తీసుకుంది. జూన్ నుండి మూడు నెలల పాటు రోజువారీ 100 సర్వీసులను తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. ముఖ్యంగా దిల్లీ నుండి షికాగో, సింగపూర్ వంటి ప్రాంతాలకు సర్వీసులను నిలిపివేసింది.
పాకిస్థాన్ గగనతలం మూసివేత వల్ల ప్రయాణ దూరం పెరిగి ఖర్చులు భారమయ్యాయని సీఈఓ విల్సన్ తెలిపారు. నిర్వహణ వ్యయం పెరగడంతో సర్వీసుల తగ్గింపు తప్పనిసరైందని ఆయన వివరించారు.
Comments
Loading comments...

