Back to feed




క్రైమ్Breaking
సైబరాబాద్ పరిధిలో భారీ సైబర్ క్రైమ్: నకిలీ ఏపీకే ఫైల్స్తో కోట్లలో నగదు మళ్లింపు.
Udayam Digital Staff Apr 06, 2026 6:25 AM హైదరాబాద్ 3 viewsabout 1 month ago

హైదరాబాద్లోని కొండాపూర్కు చెందిన ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగి ఫేస్బుక్లో పరిచయమైన గుర్తుతెలియని వ్యక్తుల మాటలు నమ్మి ఏకంగా రూ. 2.36 కోట్లు పోగొట్టుకున్నారు. 'ఫేస్బుక్ స్టోర్' పెట్టుబడుల పేరుతో కేటుగాళ్లు పంపిన నకిలీ యాప్ ద్వారా మూడు నెలల వ్యవధిలో క్రిప్టో కరెన్సీ రూపంలో ఈ భారీ మొత్తాన్ని వసూలు చేశారు.
సింగపూర్కు చెందిన మహిళగా పరిచయమై, అధిక లాభాల ఆశచూపి బాధితుడిని నిందితులు మోసం చేశారు. లాభాలు వస్తున్నట్లు యాప్లో చూపించినా, నగదు విత్డ్రా చేసుకునే వీలు లేకపోవడంతో మోసాన్ని గ్రహించిన బాధితుడు సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించారు. ప్రస్తుతం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Loading comments...
Related Articles

క్రైమ్
సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఆత్మహత్య కేసులో నమ్మలేని నిజం!
7 days agoక్రైమ్
ముంబైకి దావూద్ అనుచరుడు సలీం డోలా: 2 రోజుల ట్రాన్సిట్ రిమాండ్
10 days ago
క్రైమ్
డేటింగ్ యాప్లో వలపు వల: సాఫ్ట్వేర్ ఇంజినీర్కు రూ. 2.5 లక్షల టోకరా!
10 days ago
క్రైమ్