Back to feed
ప్రభుత్వ ఘనతలపై మంత్రి తుమ్మల
Udayam Digital Staff May 07, 2026 9:01 AM హైదరాబాద్ 5 views2 days ago

బీఆర్ఎస్ పదేళ్లలో చేయలేని పనులను కాంగ్రెస్ రెండేళ్లలోనే చేసిందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. 25 లక్షల మంది రైతులకు రూ.21 వేల కోట్ల రుణమాఫీ చేసి, అప్పులు లేని రాష్ట్రంగా తెలంగాణను తీర్చిదిద్దుతున్నామని హనుమకొండలో పేర్కొన్నారు.
గత ప్రభుత్వం ఐదేళ్ల కాలం తీసుకోవడం వల్ల రుణమాఫీ వడ్డీలకే సరిపోయిందని విమర్శించారు. బీఆర్ఎస్ అహంకార వైఖరిని ప్రజలు మర్చిపోలేదని, మళ్లీ ఆ పార్టీకి అధికారం ఇచ్చేందుకు రైతులు సిద్ధంగా లేరని తుమ్మల స్పష్టం చేశారు.
Comments
Loading comments...



