Back to feed
తులం బంగారం ఏమైంది?: కాంగ్రెస్ సర్కార్పై జగదీశ్ రెడ్డి ఘాటు విమర్శలు
Udayam Digital Staff Apr 25, 2026 10:17 AM హైదరాబాద్ 6 views14 days ago

సూర్యాపేటలో సంక్షేమ పథకాల పంపిణీ సందర్భంగా మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వంపై మండిపడ్డారు. ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో సర్కార్ పూర్తిగా విఫలమైందని, రాష్ట్రంలోని అన్ని రంగాల్లో గందరగోళం నెలకొందని, లబ్ధిదారులు తీవ్ర నిరాశలో ఉన్నారని ఆయన ఆరోపించారు.
కల్యాణ లక్ష్మి కింద ఆడపిల్ల పెళ్లికి ఇస్తామన్న తులం బంగారంపై ప్రభుత్వం ఎందుకు స్పష్టత ఇవ్వడం లేదని ఆయన ప్రశ్నించారు. అలాగే, ఆర్టీసీ కార్మికుల సమస్యలు, ఆత్మహత్యలకు కాంగ్రెస్ ప్రభుత్వ అసమర్థతే కారణమని ఆయన తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.
Comments
Loading comments...



