Back to feed
జన్మదినం సందర్భంగా అన్న క్యాంటీన్లో పేదలతో కలిసి భోజనం చేసిన సీఎం చంద్రబాబు.
Udayam Digital Staff Apr 20, 2026 7:19 AM అమరావతి 14 views19 days ago

తన పుట్టినరోజు సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విజయవాడలోని అన్న క్యాంటీన్ను సందర్శించి, పేదలతో కలిసి అల్పాహారం స్వీకరించారు. భార్య నారా భువనేశ్వరితో కలిసి ఆయన స్వయంగా ఆహారాన్ని వడ్డించి, ఆత్మీయతను చాటుకున్నారు. క్యాంటీన్ వద్ద ప్రజల నుంచి ఆయనకు ఘన స్వాగతం లభించింది.
ఈ రోజు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 269 అన్న క్యాంటీన్ల నిర్వహణ ఖర్చు రూ. 76 లక్షలను నారా భువనేశ్వరి విరాళంగా అందించారు. దీనివల్ల రాష్ట్రవ్యాప్తంగా నేడు పేదలకు మూడు పూటలా ఉచిత భోజన వసతి అందుతోంది.
Comments
Loading comments...



