Udayam Digital
Menu
హోమ్
మా గురించికాంటాక్ట్
Back to feed

ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డికి సైబర్ షాక్.

Udayam Digital Staff Apr 09, 2026 8:40 AM అల్ ఇండియా 12 viewsabout 1 month ago
ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డికి సైబర్ షాక్. - Udayam Digital
జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి సైబర్‌ నేరగాడి చేతిలో మోసపోయి లక్ష రూపాయలు కోల్పోయారు. కేంద్ర ప్రభుత్వ పథకం పేరుతో ఫైనాన్స్ అడిషనల్ సెక్రటరీగా నమ్మబలికిన కేటుగాడు, నిరుద్యోగులకు రుణాల కోసం డబ్బులు చెల్లించాలని కోరడంతో ఎమ్మెల్యే ఆ మొత్తాన్ని పంపించారు. ఆ తర్వాత అసలు వ్యక్తికి ఫోన్ చేయడంతో తాను మోసపోయానని గుర్తించిన ఎమ్మెల్యే, జూబ్లీహిల్స్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. నియోజకవర్గ యువతకు మేలు జరుగుతుందనే ఉద్దేశంతో స్పందించిన పల్లా, ఈ పరిణామంతో అప్రమత్తమై చట్టపరమైన చర్యలు కోరారు.

Comments

G
Loading comments...