వార్తలకు తిరిగి వెళ్లండి
ఐటీ షేర్ల జోరు: లాభాల్లో మార్కెట్లు

గత రెండ్రోజుల ఒత్తిడి తర్వాత ఆకర్షణీయమైన విలువల కారణంగా ఐటీ రంగ షేర్లు పుంజుకున్నాయి. జూన్ త్రైమాసిక ఫలితాల నేపథ్యంలో మదుపర్లు వీటిపై ఆసక్తి చూపుతుండటంతో సెన్సెక్స్, నిఫ్టీలు లాభాల్లో కొనసాగుతున్నాయి.
అమెరికా ఫ్యూచర్స్ సానుకూలంగా ఉండటంతో సెన్సెక్స్ 224 పాయింట్లు, నిఫ్టీ 52 పాయింట్ల లాభంతో ట్రేడవుతున్నాయి. అయితే, బ్యాంకింగ్ రంగం మరియు కొన్ని మిడ్ క్యాప్ సూచీలు మాత్రం నష్టాల్లో సాగుతున్నాయి.
Comments
Loading comments...