Udayam Digital
Menu
హోమ్
మా గురించికాంటాక్ట్
Back to feed

మే నెలలో పెరిగిన జీఎస్టీ వసూళ్లు

Rohan Gupta Jun 01, 2026 9:53 AM అల్ ఇండియా 5 viewsabout 2 hours ago
మే నెలలో పెరిగిన జీఎస్టీ వసూళ్లు - Udayam Digital
దేశంలో మే నెల జీఎస్టీ వసూళ్ల వివరాలను కేంద్ర ఆర్థిక శాఖ విడుదల చేసింది. ఈ నెలలో రూ.1.94 లక్షల కోట్ల స్థూల రాబడి నమోదైంది. గత ఏడాది ఇదే నెలతో పోల్చితే జీఎస్టీ వసూళ్లలో 3.2 శాతం వృద్ధి కనిపించింది. దిగుమతులపై పన్ను వసూళ్లు 19.1 శాతం పెరిగాయి. ఏప్రిల్, మే నెలల మొత్తం వసూళ్లు 6.2 శాతం వృద్ధితో రూ.4.37 లక్షల కోట్లకు చేరాయని కేంద్రం వెల్లడించింది.

Comments

G
Loading comments...