Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జైపూర్‌లో ఎబోలా కలకలం

Follow Udayam on Google
Rohit Singh Jun 05, 2026 5:52 PM జాతీయంGeneral
జైపూర్‌లో ఎబోలా కలకలం - Udayam
ఎబోలా లక్షణాలతో ఉగాండాకు చెందిన మహిళ జైపూర్ చేరుకుంది. ఆమెను అధికారులు వెంటనే ఆర్‌యూహెచ్ఎస్ ఆస్పత్రిలోని ఐసోలేషన్‌కు తరలించి, నమూనాలను పరీక్షల కోసం పుణె ల్యాబ్‌కు పంపారు. ఆమెకు ఇంకా ఎబోలా నిర్ధారణ కాలేదని వైద్యులు స్పష్టం చేశారు. ప్రమాదకర వైరస్ లక్షణాలు కనిపించడంతో ఆరోగ్య శాఖ అప్రమత్తమైంది. ఇప్పటికే హైదరాబాద్‌లో మరో వ్యక్తిని పరీక్షల కోసం ఆస్పత్రికి తరలించారు. కాంగో, ఉగాండా దేశాలకు ప్రయాణాలు రద్దు చేసుకోవాలని కేంద్రం సూచించింది.

Comments

G
Loading comments...