Back to feed
స్టాక్ మార్కెట్ జోరు: లాభాల్లో ముగిసిన సూచీలు
Udayam Digital Staff Apr 29, 2026 10:38 AM అల్ ఇండియా 11 views10 days ago

దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు బుధవారం లాభాలతో ముగిశాయి. ఎఫ్ఎంసీజీ, ఆటో, రియల్టీ రంగాల షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించడంతో సెన్సెక్స్ 609 పాయింట్లు లాభపడి 77,496 వద్ద, నిఫ్టీ 181 పాయింట్లు పెరిగి 24,177 వద్ద స్థిరపడ్డాయి.
ఐటీసీ, టెక్ మహీంద్రా, మారుతీ సుజుకీ, రిలయన్స్ షేర్లు ప్రధానంగా లాభపడగా, ఇండిగో, ఎన్టీపీసీ, ఐసీఐసీఐ బ్యాంక్ షేర్లు నష్టాలను చవిచూశాయి. అంతర్జాతీయ మార్కెట్లో బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర 114 డాలర్లుగా కొనసాగుతోంది.
Comments
Loading comments...



