Udayam Digital
Menu
హోమ్
మా గురించికాంటాక్ట్
Back to feed

రెపో రేటును 5.25 శాతం వద్ద యథాతథంగా ఉంచిన కేంద్ర బ్యాంక్.

Udayam Digital Staff Apr 08, 2026 4:58 AM అల్ ఇండియా 9 viewsabout 1 month ago
రెపో రేటును 5.25 శాతం వద్ద యథాతథంగా ఉంచిన కేంద్ర బ్యాంక్. - Udayam Digital
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) వరుసగా రెండోసారి కీలక వడ్డీ రేట్లను యథాతథంగా ఉంచింది. రెపో రేటును 5.25 శాతం వద్దే కొనసాగిస్తున్నట్లు ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా బుధవారం జరిగిన 2026-27 తొలి ద్వైమాసిక సమీక్షలో వెల్లడించారు. గత ఏడాది కాలంలో రెపో రేటును మొత్తంగా 1.25 శాతం మేర తగ్గించిన ఆర్బీఐ, ఈసారి మాత్రం ఎటువంటి మార్పులు చేయలేదు. ఫిబ్రవరి సమీక్షలోనూ వడ్డీ రేట్లను స్థిరంగా ఉంచిన నేపథ్యంలో, ప్రస్తుత నిర్ణయం ఆర్థిక వ్యవస్థపై సానుకూల ప్రభావం చూపుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు.

Comments

G
Loading comments...